mythoughts
Wednesday, September 10, 2025
garuda story inner meaning
శ్రీ గరుత్మంతుని కదా అందులోని అర్థం
Saturday, January 4, 2025
yoga vasistam
21. బ్రహ్మాండముల చమత్కారం
శ్రీ వసిష్టమహర్షి : ఈ 'జగత్తులు' అనబడునవన్నీ చిదాకాశము కంటే వేరు కాదు. కాని, అజ్ఞానుల దృష్టికి స్వకల్పనా కారణంగా అట్లు పదార్థజాలానుభవంలో ప్రాప్తిస్తున్నాయి. వారి అనుభవమును దృష్టిలో పెట్టుకొనే ఇదంతా చెప్పాను. అజ్ఞానము చేతనే ఈ జగత్తులు ఉత్పన్నమై నశిస్తున్నాయి. దీనికి మనకు దృష్టాంతము బాలుని చిత్తము యొక్క కల్పనా వ్యవహారమే. ఆటబొమ్మలలో "ఇది పెళ్ళికూతురు, ఇది పెళ్ళికొడుకు" వంటి వివాహాది కల్పనల్ని కల్పించి బాలుడు అదంతా వాస్తవమువలె క్రీడించుచున్నాడు కదా! ఈ బ్రహ్మాండముల సృష్టి స్థితి లయాలు కూడా అట్టివే. అవి కల్పనయందే ఉద్భవించి, కల్పన చేతనే నశిస్తున్నాయి.
శ్రీరాముడు : హే మహర్షీ! ఈ "ఊర్ధ్వ-అధో - తిర్యక్ పైన క్రింద-వెనుక)" కల్పనలు, ఈ బ్రహ్మాండములు ఎక్కడినుండి వస్తున్నాయి? ఇవన్నీ అధిష్ఠానమగు బ్రహ్మము నందు స్వతహాగా ఉన్నవి కావు కదా! కాని బ్రహ్మాండములోకి ఈ పైన క్రింద వెనుక ముందు కల్పనలు వచ్చిపడు. చున్నాయే? ఈ బ్రహ్మాండముల గురించి మరికొంత వివరించండి.
శ్రీ వసిష్ఠమహర్షి రేచీకటి దోషం ఉన్న కన్నులు కలవానికి ఆకాశంలో జడలు కనిపిస్తాయి. చూచావా? అవిద్య యందున్న వానికి నాశరహితమగు పరబ్రహ్మము నందు ఈ బ్రహ్మాండములన్నీ అగుపిస్తున్నాయి.
పదార్ధములన్నీ ఈశ్వరేచ్ఛను అనుసరించే ప్రవర్తిస్తున్నాయి. అంతేకాని, వాటికి ఎట్టి స్వాతంత్ర్యం లేదు. ఈ మన బ్రహ్మాండంలో పార్థివ (స్థూల) భాగము క్రిందకు, ఆకాశం పైన ఉన్నాయి. జ్యోతిశ్చక్రమును దర్శించునట్టి మహాపండితులు, "ఈ బ్రహ్మాండము ఆకాశమున ఉన్నట్టి మట్టి-ముద్ద వంటిది. దశదిక్కులు దీని 'కాళ్ళు' వంటివి. ఒక చీమ యొక్క దేహంవలె దీని క్రింది భాగంలో భూమండలం ఉన్నది" అని వర్ణిస్తున్నారు.
కొన్ని-కొన్ని బ్రహ్మాండభూములలో మనుష్యులు లేరు. చెట్టు-పుట్టలు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఆకాశభాగంలో మాత్రం దేవతలు, కిన్నెరలు ఉన్నారు. మరికొన్ని బ్రహ్మాండములు అప్పటికప్పుడు కల్పించబడినట్టి ప్రాణసమూహములతో, గ్రామములతో, పురములతో, పర్వతములతో ఉత్పన్నములౌతున్నాయి. ఇవన్నీ చిదాకాశము నందే ఉంటూ, అందులోనే లీనమౌతున్నాయి. మంచుగడ్డలు అనేక ఆకారములు సంతరించుకొంటున్నప్పటికీ స్వతహాగా అంతా జలమే కదా! "ఈ స్పష్ట = వస్తువులన్నిటికీ ఆత్మవస్తువే కారణం" అని చెప్పబడుతోంది. అదియే అంతా అయివున్నది.
శుద్ధబోధమయమైన చిదాకాశసముద్రంలో "బ్రహ్మాండములు" అనే తరంగాలు నిరంతరం లేస్తున్నాయి. మరల అందులోనే లీనమగుచున్నాయి. భవిష్యత్తులో కూడా అనేక బ్రహ్మాండ తరంగాలు లేవబోతున్నాయి. అందులో కొన్ని "సంకల్పరాహిత్యం చేత, 'అంధకార' స్వరూపములై శూన్యమునందు. నిద్రిస్తూ ఉన్నాయి" అని అనుమానించబడుతోంది. కొన్ని కొన్ని బ్రహ్మాండతరంగాలు కల్పాంత
సూచకమైన ధ్వనులు చేస్తున్నప్పటికీ, విషయరస మోహితులైన ఆ బ్రహ్మాండములందలి జీవులు చెవులకు అవేమీ వినిపించటం లేదు. వారి బుద్ధికి ఏదీ గోచరించటం లేదు.
కొన్ని బ్రహ్మాండములు అప్పుడే ఉద్భవిస్తూ ఉండగా వాటిలో మొట్టమొదటి విశుద్ధములైన జీవసమూహములు లేచుచున్నాయి. మరికొన్ని బ్రహ్మాండములలో మహాప్రళయ సమయం ఆసన్న మగుట చేత సూర్య-చంద్ర నక్షత్రాదులు భూమిని దగ్ధం చేస్తున్నాయి. భూమి కరిగిపోతోంది. కొన్నిటికి పట్టుకొమ్మ దొరక్క పడిపోతున్నాయి. మరికొన్నిటి యందు లేవవలెననే ఆశ కూడా కలిగియుండటం లేదు. “అట్లు బ్రహ్మాండములు కూలిపోవటం ఎట్లా సంభవం?” అని అనుమానించ వలసిన పనిలేదు. ఇవన్నీ చిద్రూపములే కదా! కనుక బ్రహ్మాండములయొక్క ఉత్పత్తి పతనాలు తప్పకుండా జరుగుచున్న విషయాలే.
కొన్నికొన్ని స్తబ్ధములై ఉన్నాయి. వాయువునందు స్పందము (లేక ప్రసరణ) ఉదయిస్తున్నట్లు "చిత్అతత్త్వము" (Knowledge consciousness) నందు పైన చెప్పిన కల్పనలన్నీ ఉదయిస్తున్నాయి. అయితే, ఈ బ్రహ్మాండముల నిజస్వరూపమేమిటి? చెపుతాను. విను. పూర్వపూర్వ జన్మలందు ఆచరించబడిన జ్ఞానకర్మాదుల అనుష్టానంచేత ఒకానొక ద్రష్ట (లేక జీవుడు) సంకల్పమాత్రంచేత సృష్టిని నిర్మించగల సామర్ధ్యం పొందుచున్నాడు. అట్లు "ప్రజాపతి" అయినట్టి ఒకానొకనిచే ఈ బ్రహ్మాండములు నిర్మించబడుచున్నాయి. తత్కారణంగా ఈ కల్పమున ఉన్న సృష్టికి, ముందు ముందు రాబోయే కల్పములందు ఏర్పడబోయే సృష్టులకు భేదం ఉంటే ఉండవచ్చు. ఈ విషయం శాస్త్రాలు కూడా అంగీకరిస్తున్నాయి.
కొన్ని బ్రహ్మాండములు బ్రహ్మదేవుడు రచించాడు. మరికొన్నిటిని విష్ణువు కల్పించాడు. ఇంకొన్నిటిని ప్రజాపతులు రచిస్తున్నారు. కొన్నింటికి కర్తయే లేదు. అందుచేత అవి వృక్షాదులతో మాత్రమే ఉన్నాయి. అందు బుద్ధిజీవులు లేరు. కొన్ని బ్రహ్మాండములు కొందరు కలిసి విచిత్రంగా సృష్టిస్తున్నారు. కొన్ని బ్రహ్మాండముల సమూహం ఏకైక నియమము ననుసరించి ప్రవర్తిస్తున్నాయి. కొన్నిటిలో సృష్టియే లేదు. కొన్నిటిలో మానవులు మాత్రం లేరు. మిగతావన్నీ ఉన్నాయి. కొన్ని పాషాణములతో మాత్రమే నిండివున్నాయి. కొన్నిటినిండా క్రిములు మాత్రమే ఉన్నాయి. కొన్నికొన్ని కేవలం దేవతలతోను, మరికొన్ని కేవలం మనుష్యులతోను, ఇంకొన్ని ఈ రెండిటితోను నిండి ఉన్నాయి. కొన్నిట్లో చలనములేని జంతువులు మాత్రం ఉన్నాయి.
ఓ రాఘవా! ఇట్టివేయైన సృష్టులతో నిండిన బ్రహ్మాండములు ఇంకా అనేకం ఉన్నాయి. వాటివాటి వ్యవహారాదులు యోగుల ఊహలకు కూడా అందనంతటివి. అవన్నీ శూన్యమునందే ఉండి మహాకాశస్వరూపమై వ్యవహరిస్తున్నాయి. విష్ణువు మొదలైన దేవతలు కూడా తమ జీవితమంతా వెచ్చించినప్పటికీ వాటి పరిణామము తెలియజాలరు. ఆభరణములలో రత్నములు పొదగబడినట్లు, ఈ బ్రహ్మాండములలో 'భూతాకర్షణశక్తి' ఉన్నది. అందుచేతనే అవి జలము, జీవులు మొదలైన వాటిని కోల్పోకుండా ఉన్నాయి. ఓ మహామతీ! ఈ జగత్తుల విషయం నా దృష్టి పథంలో ఉన్నంతవరకు,
ఇక్కడ మనకు అవసరమైనంత వరకు వర్ణించాను. వాస్తవానికి వాటినన్నిటిని వర్ణించి నేను చెప్పలేను. ఎన్ని లక్షల, కోట్ల బ్రహ్మాండములు ఎన్నెన్ని విభేదములతో ఉన్నాయో. అదంతా భాషకు, భావానికి అందదని మాత్రం మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. #from yoga vasista
Friday, January 3, 2025
sri devi bhagavatam stories in telugu
జనమేజయా ! కృతయుగంలో జన్మించి పుణ్యకర్మలు ఆచరించినవారు జన్మపరంపరాబంధం నుంచి విముక్తులై దేవలోకాలకు వెళ్ళిపోయారు. చతుర్వర్ణాలవారూ స్వధర్మనిరతులై సత్కర్మలను ఆచరిస్తే కర్మత్రయాన్ని క్షయింపజేసుకుని ఆయా ఉత్తమలోకాలకు తరలిపోతారు. రజకాది వర్ణాలవాట సత్యమూ, దయ, దానమూ, ఏకపత్నీవ్రతమూ, అద్రోహమూ (ద్రోహచింత లేకపోవడం), సర్వప్రాణి సమానత్వమూ వంటి సాధారణ ధర్మాలను ఆచరిస్తే చాలు స్వర్గలోకం చేరుకుంటారు. ఇది సత్యయుక్త లక్షణం. త్రేతా ద్వాపరాలలోకూడా ఇంతే. ఈ కలియుగంలోమాత్రం పాపిష్ఠులు నరకానికి పోతారు. వీరంతా యుగాలు మారేంతవరకూ ఆయాలోకాలలో నిలుస్తారు. మళ్ళీ ఆ యుగం రాగానే మానవలోకంలో జన్మిస్తుంటారు. కలియుగం ముగిసి మరొక్కసారి సత్యయుగం ప్రారంభంకాగానే అప్పటి ఆ ధర్మాత్ములూ పుణ్యాత్ములూ స్వర్గం నుంచి మానవులై భూలోకానికి అవతరిస్తారు. ద్వాపరం ముగిసి కలియుగం మొదలుకాగానే నరకం నుంచి పాపాత్ములంతా మళ్ళీ భూమికి దిగుతారు. ఇది కాలసమాచారం. దీనికి తిరుగులేదు. తెలుసుకో. అందుచేత కలియుగం పాపకూపం. ప్రజలుకూడా అలాగే దానికి తగ్గట్టు
ఉంటారు. ఎప్పుడైనా చాలా అరుదుగా ఒక్కోసారి దైవవశాత్తు కొందరు జీవులకి యుగవ్యత్యయు వస్తుంది. క్రిందటి కలియుగంలో సజ్జనులై జీవయాత్ర సాగించినవారు మరుసటి కల్పన ద్వాపరంలో జన్మిస్తుంటారు. అలాగే కొందరు త్రేతాయుగంలోకీ మరికొందరు సత్యయుగంలోకీ (కృత) మారుతుంటారు. సత్యయుగంలో జన్మించి దుష్టులుగా మారినవారు అనంతరకల్పన కలియుగంలోకి దిగిపోతుంటారు. సంచితకర్మ ప్రభావంవల్ల దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు. జీవిస్తున్న యుగం తాలూకు ప్రభావంవల్ల అవే పాపాలు మళ్ళీ ఆచరిస్తుంటారు. అంచేత జనమేజయా ! అప్పటి పుణ్యాత్ములు ఇప్పుడు కనపడరు. ఇప్పటి పాపాత్ములు అప్పుడు వినపడరు. యుగధర్మాల లక్షణం ఇది. తెలిసిందా ?
పితామహా ! చాలావరకూ అర్థమయ్యింది. అయితే ఆ యుగధర్మాలు ఏమిటో మరింత
వివరంగా తెలుసుకోవాలని ఉంది. తెలియజెప్పవా !
sri devi bhagavatam story in telugu
నారదా! ఇదంతా మహామాయా విలాసం. సర్వప్రాణికోటికీ శరీరాల్లో అనేక దశాభేదాలు ఉంటాయి. జాగ్రత్ స్వప్న సుషుప్తులు కాక నాల్గవ దశ ఒకటి ఉంది. అదే మరణానంతరం మరొక శరీరాన్ని పొందడం. ఇందులో సందేహించవలసింది ఏమీ లేదు. నిద్రపోయిన మానవుడు ఏమీ వినలేడు, తెలుసుకోలేడు, చెయ్యలేడు. మెలకువగా ఉన్నప్పుడు అన్నీ చేస్తాడు. అన్నీ తెలుసుకుంటాడు. నిద్రలోకూడా చిత్తానికి కదలికలుంటాయి. అవే స్వప్నచలనాలు. అవన్నీ మనోభేదాలూ, రకరకాల మనోభావాలూను. ...
నిద్రయా చాల్యతే చిత్తం భవంతి స్వప్నసంభవాః ॥ నానావిధా మనోభేదా మనోభావా హ్యనేకశః ॥
11
(30 - 41)
ఏనుగు నన్ను చంపడానికి స్తోంది. ఎదిరించలేను, ఎటూ పారిపోలేను. ఏమి చెయ్యాలి అంటూ స్వప్నంలో దుఃఖిస్తాడు. అలాగే కొన్ని కలల్లో సుఖాలు అనుభవిస్తాడు. మేల్కొన్నాక అవన్నీ గుర్తు తెచ్చుకుని జనాలకి వివరంగా చెబుతాడు. కలకంటున్నంతసేపూమాత్రం ఇది భ్రమ అని ఎవరూ అనుకోరు. ఇలాంటిదే ఇహజన్మానుభవమూను. సంసారంలో ఉన్నంతకాలమూ ఇది భ్రమ అనిపించదు. (మరొక జన్మ పొందాక, గతజన్మ స్మృతిని నిలుపుకోగలిగితే అప్పుడు తెలుస్తుంది ఈ మాయావిలసనం) అలా అనిపించకపోవడమే మాయావిభవం. అది చాలా దుర్గమం సుమా! #from SRI DEVI BHAGAVATAM
Sunday, October 27, 2024
వేద విజ్ఞానం
Monday, October 7, 2024
శ్రీకృష్ణుని గొప్పదనం ఏమిటి?
అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో రెండు రైల్వే లైన్లు పక్కపక్కనే ఉన్నాయి. అందులో ఒక లైన్ మీదనే రైళ్ళు నడుస్తాయి. రెండవది అసలు వాడకంలో లేదు. ఈ సంగతి ఊర్లోని పెద్దలకు, పిల్లలకు, అందరకు తెలుసు. ఒకరోజు ఇరవై మంది పిల్లలు రైళ్లు ఎప్పుడూ నడిచే మార్గంలో ఆడుకుంటున్నారు. ఇద్దరబ్బాయిలు రైలు వాడకంలో లేని మార్గం మీద ఆడుకుంటున్నారు. రైలు శరవేగంతో వస్తోంది. రైలుని వాడకంలో లేని మార్గం పైకి మళ్లించే మీట మీ చేతిలో ఉంది. మీరేం చేస్తారు? రైలును ఎప్పుడూ వెళ్లే మార్గంలో వెళ్ళనిచ్చి యిరవై మంది పిల్లలను చావనిస్తారా, దారి మళ్లించి ఇద్దరు పిల్లల చావు మేలు అంటారా?
ఐదు నిమిషాలు ఆలోచించండి ఏ మార్గం మేలు? ఇరవై మంది మరణమా, ఇద్దరి మరణమా?
అయిదు వేల ఏళ్ల నాడు ఇదే ప్రశ్న ఉత్పన్నమైంది. సమాధానమిచ్చింది గీతాచార్యుడైన శ్రీకృష్ణుడు. ధర్మ మార్గంలో వెళ్లే వారిని రక్షించాలి, అధర్మవర్తనులను అణిచేయాలి. రైలు వెళ్లే మార్గంలో ఆడుకోవడం తప్పు కాదా? ఆ మార్గంలో రైలు వెడుతుందని పిల్లలకు తెలుసు. అయినా తప్పు చేశారు.
దుర్యోధనుడు అదే మాట అన్నాడు. "నాకు ఏది ధర్మమో తెలుసు. అయినా మనసు ధర్మం పైకి పోదు. ఏది అధర్మమో తెలుసు, అయినా మనసు దానివైపే పోతుంది." నిర్ణయం తీసుకోవలసింది సంఖ్యాబలాన్ని బట్టి కాదు. ధర్మ ప్రవర్తనను బట్టి రక్షణను చేపట్టాలి. కౌరవులను శిక్షించి ధర్మమార్గంలో వెళ్లే ఐదుగురు పాండవులను రక్షించాడు. ధర్మ మార్గంలో పయనిస్తూ ధర్మపక్షమే ఉండమని మనకు ఆదేశం ఇచ్చాడు.
ఇప్పుడు మీకు ఏ మార్గం అవలంబించాలన్న దానికి గీతాచార్యుల నుంచే సమాధానం లభించింది కదా. ఇద్దరే కావచ్చు కానీ వాడకంలో లేని రైలు మార్గం పై ఆడుకుంటున్న పిల్లలు తప్పు చేయలేదు. వారిని రక్షించడమే సరైన పని.
రైలు మార్గాల ప్రశ్న కల్పితమే కానీ జీవితంలో ఎన్నో సందర్భాలలో మంచి వారి వైపు నిలబడవలసిన పరిస్థితులు కుటుంబాలలో, రాజకీయాలలో ఎదురవుతాయి. ఇంట్లో నలుగురు కొడుకులలో ఒకడు కష్టపడి చదివి మంచి ఉద్యోగం సంపాదించి ఆర్జనపరుడు కావచ్చు. మిగిలిన ముగ్గురూ కష్టపడకుండా ఆవారాగా తిరుగుతూ ఉండొచ్చు. కష్టపడి పైకి వచ్చిన వాడిని మిగిలిన ముగ్గురి పోషణ బాధ్యత స్వీకరించమనడం న్యాయమా?
కష్టపడి పని చేసి సంపాదించి పన్నులు కట్టేవారు కొందరయితే ప్రభుత్వం అమలు పరిచే ఉచిత పథకాలు అనుభవిస్తూ దేశాభివృద్ధికి ఏ మాత్రం పాటు పడని వారు మరెందరో. రాజకీయ నాయకులు ఆలోచించ వలసిన విషయం ఇది.
పరిపాలన చేసేటప్పుడు దేశాధినేతకు ఏ మార్గం అవలంబించాలన్న సందేహం కలిగే సన్నివేశాలు ఎన్నో ఎదురవుతాయి. అధర్మ మార్గంలో వెళ్లేవారు ఎక్కువ ఉండవచ్చు. ఆ మార్గంలో వెళ్లి తీరా శిక్ష పడుతున్నప్పుడో, పడినప్పుడో, పడుతుందన్న భయం కలిగినప్పుడో కన్నీటిగాథ వినిపించి ప్రజలను తమ వైపు తిప్పుకుని క్షమాభిక్ష కోరేవారు అనేకులు. అయ్యో పాపం వారిని వదిలేయాలి అనేవారు కోకొల్లలు.
శిక్షార్హులను వదిలేయడాన్ని మించిన పాపం లేదు. రథచక్రం కూరుకుపోయినప్పుడు ధర్మ ప్రసంగం మొదలెట్టిన కర్ణుని శ్రీకృష్ణుడు అనేక సందర్భాలలో నీకు ధర్మం గుర్తు రాలేదా అని ప్రశ్నించాడు. నేటి దేశాధినేతలు గుర్తుంచుకోవలసిన విషయం ఇది.
అత్యధికుల మార్గమే అనుసరణీయం కాదు. సాధువులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి ధర్మసంస్థాపనకై తాను అవతరించినానని గీతాచార్యుడు చెప్పి ఆచరించి చూపాడు.
ఆయన బోధనలను తెలుసుకొని, ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలి.
మెజారిటీ చెప్పినదే సరి అని అనుకోరాదు.
కృష్ణం వందే జగద్గురుం
garuda story inner meaning
How to understand the Puranas "Puranethi Navam" means that the Purana will always be new no matter how often it is read. Did the P...
-
How to understand the Puranas "Puranethi Navam" means that the Purana will always be new no matter how often it is read. Did the P...
-
Download sampoorna mahabharatam telugu pdf download ... download here ...
-
"అక్షౌహిణి అంటే?" 17-01-2024 ఒక యుగంలో లేదా ఒక కాలంలో ఆ ప్రజల జీవన విధానాలు మరియు ఆచార వ్యవహారాలతో పాటుగా అనేక అం...