Monday, December 16, 2019

కంచి పరమాచార్య వైభవం

ధర్మ రక్షణ - దేశ రక్షణ

ముఖ్యంగా స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో ఉన్న పరిస్థితులు ఎలాంటివి అంటే, మొట్టమొదట స్వాతంత్ర్యోద్యమాలు స్వామి వివేకానంద స్ఫూర్తితో ఉద్భవించినప్పుడు “సనాతన ధర్మంతో కూడిన అచ్చమైన భారత దేశాన్ని” రక్షించుకోవాలనే తపనే ఆనాడు ఉన్న మహాత్ములది. కాని తరువాత తరువాత స్వాతంత్ర్యోద్యమం ధర్మమయమైన దేశాన్ని సాధించడం అనేటువంటి మూర్తిని విడిచిపెట్టి మరొక రూపం తీసుకుంది.

అది కేవలం రాజకీయ ఉద్యమంగా మారిపోయింది. “ఈ రాజకీయోద్యమం ఇలాగే కొనసాగి కాని మనకు స్వాతంత్ర్యం సిద్ధిస్తే, మన ధర్మం ఏమవుతుంది” అని ఆలోచించిన వాళ్ళు ఈ స్వాతంత్ర్యోద్యమ సమయానికి కొద్దిమంది మాత్రమే ఉన్నారు. గట్టి సంఖ్యలో చెప్పుకోలేము. అందులో యతీశ్వరులు మహాత్ములు మా పీఠాలేమైపోతాయో అని బాధపడేవాళ్ళే చాలామందున్నారు కాని, స్వాతంత్ర్యం సిద్ధిస్తే ఈ సనాతన ధర్మం ఏమౌతుంది? ఎటువంటి రాజ్యాంగం తయారవుతుంది? ఎందుకంటే రాజకీయ పరమైనటువంటి వాతావరణమే తప్ప ధార్మికమైన వాతావరణం లేదు. అలాంటి స్థితిలో ఈ దేశంలో ఈ సనాతాన హైందవ ధర్మం రక్షింపబడాలి అనే తపన పడ్డటువంటి ఏకైక ఆచార్యులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు.

మహిమలు చూపే విషయములే కాకుండా ధర్మరక్షణకు వారు చేసినవే మనం తెలుసుకోవలసింది. ఇది చాలా స్ఫూర్తి. అసలు దేశభక్తి లేనివారికి దైవభక్తి లేనట్టే లెక్క. ఒకవేళ దైవభక్తి ఏదైనా ఉంటే, వాడిల్లు వాడి కుటుంబం క్షేమంగా ఉండడం కోసం చూసిన భక్తియే తప్ప ఇక ఏది లాభం లేదు దానివల్ల. అందుకు ప్రధానంగా ఈ దేశం క్షేమంగా ఉండాలి. ధర్మం క్షేమంగా ఉండాలని ముందు కోరుకోవాలి. ఎలాగైతే మన ఇంట్లో ఉన్న మనం నేను క్షేమంగా ఉండాలి అని ఎంత కోరుకుంటామో నా ఇల్లు క్షేమంగా ఉండాలని అంతే కోరుకోవాలి.

లేకపోతే మీ జపం మీరు చేస్తుంటే మీ ఇంటి పైకప్పు ఊడి నెత్తిమీద పడితే, ఎవడు రక్ష. అందుకు మన జపం మనకు సాగుతున్నా, మన ఇల్లంతా బాగుండాలని ఎలా అనుకుంటామో, ఈ దేశమంతా ధర్మమంతా బాగుండాలని కోరుకోవాలి. అందుకే వయుక్తిక మోక్షం కోసం సాధన చేయడం ఎంత అవసరమో, సామాజికమైన దేశ క్షేమం కోసం సాధన చెయ్యడం అంత అవసరం.

అందులో పీఠాధిపతి వ్యవస్థని ఆదిశంకర భగవత్పాదులు వారు ఆ కారణం చేతనే ఏర్పాటు చేశారు. నాలుగు వైపుల్నుంచి కూడాను భారతదేశాన్ని రక్షించడం కోసమే ఆయన పీఠములను ప్రతిష్టాపన చేశారిక్కడ. అటువంటి శంకరుల హృదయం తెలిసినటువంటి శంకరులు మళ్ళి అవతరించిన శంకరులు. మాకనిపిస్తుంది కేవలం ముప్పైరెండేళ్ళు ఉండి చెయ్యాల్సిందంతా చేసి నేను వెళ్ళిపోయాను.

కాని కలి ముదిరిపోతోంది. ముప్పైరెండేళ్ళ ఉనికి చాలదు. ఒక సంపూర్ణమైన శతవర్ష ఆయుః పరిమితితో కూడిన ఉనికి కావాలి అని అనుకున్న శంకరులు మళ్ళి చంద్రశేకరేంద్ర సరస్వతి స్వామివారిగా అవతరించారు. ఇందులో సందేహం లేదు.

--- బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి ప్రవచనం నుండి

అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


No comments:

Post a Comment

garuda story inner meaning

How to understand the Puranas "Puranethi Navam" means that the Purana will always be new no matter how often it is read. Did the P...