Sunday, October 6, 2024

వేదంలో సేద్యం

వేదంలో సేద్యం

శ్రీకృష్ణ యజుర్వేదంలో ఆహవనీయ చయనం కోసం భూమిని దున్నడం, విత్తనాలు నాటడం మొదలయిన విషయాలను పేర్కొనడం జరిగింది.

మూ : సంవరత్రా దధాతన నిరాహావాన్‌ కృణోతన. సించామహా అవట ముద్రిణం వయం విశ్వాహాదస్తమక్షితమ్‌

- శ్రీకృష్ణ సం. - 4 కాం ; 2 ప్ర. 5 అను. ; 5 ప.

(ఓ కర్షకులారా! నీళ్ళు తోడడానికి చర్మంతో చేసిన తాడు నూతి దగ్గర ఉంచండి. ఎడ్లు నీళ్ళు త్రాగడానికి తొట్టెలను ఏర్పరచండి. నూతుల్లో వేసవిలో కూడా నీరు ఎండిపోకుండా జల బాగా వచ్చేలా లోపలి బురద తొలగించాలి. నూతి గట్టులు పడిపోకుండా ఉండాలి.)

ఈ మంత్రంలో దున్నే సమయంలో ఎడ్లకు దప్పిక తీర్చడానికి ఏర్పాటు చెప్పబడింది. నోరులేని మూగ జీవాలకు మనం తోచిన సమయంలో నీరు త్రాగించడం కాక వాటికి దప్పిక కల్గినపుడు నీరు త్రాగడానికి వీలుగా ఇలాంటి ఏర్పాట్లు చేయడం సముచితం.
సీరా యుఞ్జన్తి కవయో యుగా వితన్వతే పృథక్‌ (పై గ్రంథం)

(వ్యవసాయ నిపుణులు నాగలిని కట్టుదురు గాక. వాటికి కాడులను విడివిడిగా అమర్చుదురు గాక.)

మూ : శునం నః ఫాలా వితుదన్తు భూమిగ్‌ం

శునం కీనాశా అభియన్తు వాహాన్‌

శునం పర్జన్యో మధునా పయోభి

శ్శునా సీరా శున మస్మాసు ధత్తమ్‌ -పై గ్రంథం - 6 పన.

(మాకు సుఖం కలిగేలా నాగళ్ళ కొనభాగాలు భూమిని బాగా దున్నాలి. కర్షకులు ఎడ్లను సుఖంగా నడిపించాలి. మేఘుడు మధుర రసంతో కూడిన నీటిని వర్షించాలి. వాయువు, ఆదిత్యుడు మాకు సుఖం కలిగించాలి.)

ఇలా వేదం యజ్ఞంలో దున్నే ప్రక్రియను సూచిస్తూ లోకంలో దున్నే ప్రక్రియను గూడా పేర్కొంది.

మూ : యజుషా యునక్తి యజుషా కృషతి వ్యావృత్యై

- శ్రీ కృష్ణ సం. - కాం. 5 ; ప్ర. 2 ; అను. 5

(యజ్ఞంలో మంత్రంతో నాగలిని కట్టాలి. మంత్రంతోనే దున్నాలి. లౌకికంగా నాగలి కట్టినపుడు, దున్నునపుడు మంత్రాలుండవు. వాటికంటే వీటికి భేదం ఉండడం కోసం యజ్ఞంలో మంత్రాలను వినియోగించాలి.)

మూ : షడ్గవేన కృషతి - శ్రీ కృష్ణ సం. - కాం. 5 ; ప్ర. 2 ; అను. 5

(ఆరు ఎడ్లను కట్టిన నాగలితో దున్నాలి.)

ఈ నాగలికి మూడు భాగాలుంటాయి. ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క కాడి ఉంటుంది. ప్రతి కాడికి 2 ఎడ్లు ఉంటాయి.

మూ : యద్ద్వాదశ గవేన - పై గ్రంథం

12 ఎడ్లను కట్టిన నాగలితో గూడా దున్నవచ్చు. దీనికి 6 భాగాలుంటాయి. ప్రతి భాగంలో ఒక కాడి, ప్రతి కాడికి రెండేసి ఎడ్లను కట్టుతారు.


మూ : లాఙ్గలం పవీరవగ్‌ం సుశేవగ్‌ం సుమతిత్సరు. ఉదిత్కృషతి

- శ్రీ కృష్ణ సం. - 4 కాం. ; 2 ప్ర. ; 5 అను. ; 6 పన.

(వజ్రం వలె అతి తీక్షణమైన ఈ నాగలి పెద్ద మట్టిబెడ్డలు పైకి వచ్చేలా దున్నాలి. నాగలి బాగా పదునుగా ఉంది కనుక దీనివల్ల కర్షకులకు ప్రయాస ఉండదు. దీనిని కర్షకులు బాగుందని ప్రశంసిస్తారు. భూమి ఎత్తుపల్లాలుగా ఉండడం చేత ఈ నాగలి గమనం మధ్యలో విచ్ఛేదాన్ని పొందుతోంది.)

వేదంలో 14 రకాల ధాన్యాల ప్రసంగం వుంది.

మూ : చతుర్దశభి ర్వపతి సప్తగ్రామ్యా ఓషధయ స్సప్తారణ్యా ఉభయీషా మవరుద్ధ్యై

- శ్రీ కృష్ణ సం. - 5 కాం. ; 2 ప్ర. ; 5 అను.

(పదునాలుగు మంత్రాలతో విత్తనాలు నాటాలి. గ్రామాల్లో దొరికే ధాన్యాలు ఏడు. అడవులలో దొరికే ధాన్యాలు ఏడు. ఈ రెండు రకాల ధాన్యాలను పొందడానికి 14 మంత్రాలను వినియోగించాలి.)

నువ్వులు, మినుములు, వరి, యవలు, కొఱ్ఱలు, చిఱువడ్లు, గోధుమలు గ్రామాల దగ్గర పండించే ధాన్యాలు, వెదురు బియ్యం, చావలు, నెవ్వరి ధాన్యం, కారునువ్వులు, అడవి గోధుమలు, మర్కటకాలు, గార్ముతాలు, అడవి ధాన్యాలు.

దున్నే పద్ధతిని కల్ప సూత్ర మిలా పేర్కొంది.

''పుచ్ఛాచ్ఛిరోధికృషతి కామం కామదుఘేధుక్ష్వేతి ప్రదక్షిణ మావర్తయన్‌ తిస్రస్తిస్ర స్సీతా స్సంహితాః కృషతి మధ్యే సంభిన్నా భవన్తి దక్షిణా త్పక్షా దుత్తరస్మాత్‌ దక్షిణాయై శ్రోణ రుత్తర మంసముత్తరాయై దక్షిణమ్‌''

(''కామం కామదుఘేధుక్ష్వ' అనే మంత్రంతో తోక భాగం నుండి శిరో భాగం వరకు ప్రదక్షిణంగా తిరుగుతూ మూడు మూడు నాగేటి చాళ్ళు కలిగేలా దున్నాలి. ఈ చాళ్ళు దగ్గర దగ్గరగా ఉండాలి. ఈ చాళ్ళు మధ్యలో కలుస్తాయి. దక్షిణ పక్షం నుండి ఉత్తరం వైపు దక్షిణ శ్రోణి నుండి ఉత్తరాంసం వరకు దున్నాలి.)

దున్నవలసిన భూభాగాన్ని ఒక పక్షిలా భావించి దున్నే రీతి చెప్పారు. దాని తోక భాగం నుండి శిరోభాగం వైపు దున్నాలి. దక్షిణం రెక్క నుండి ఉత్తరం రెక్క వఱకు దున్నాలి. శ్రోణి అంటే పిఱుదు. అంసం అంటే భుజ శిరస్సు (మూపు). దక్షిణం పిరుదు నుండి ఉత్తర భుజశిరస్సు వరకు, ఉత్తరం పిఱుదు నుండి దక్షిణ భుజ శిరస్సు వరకు దున్నాలి. ఈ పద్ధతిని సంగ్రహంగా వేదం ఇలా సూచించింది.

మూ : తిస్ర స్తిస్ర స్సీతాః కృషతి (తోక నుండి శిరస్సు వరకు, దక్షిణం రెక్క నుండి ఉత్తర రెక్క వరకు, దక్షిణం పిఱుదు నుండి ఉత్తరం మూపు వరకు, ఉత్తరం పిఱుదు నుండి, దక్షిణం మూపు వరకు మూడు మూడు నాగేటి చాళ్ళను దున్నాలి. ఇలా మొత్తం 12 చాళ్ళు అవుతాయి.) - శ్రీ కృష్ణ సం. - కాం. 5 ; ప్ర. 2 ; అను. 5

ఇలా దున్ని విత్తనాలు నాటుతారు. అపుడు చెప్పే మంత్రాలలో ఓషధుల్ని మూలికల్ని వినియోగించి వైద్యం చేయడం సూచించబడింది.

మూ: య దోషధయ సృఙ్గచ్ఛస్తే రాజాన స్సమితావివ. విప్రస్స ఉచ్యతే భిషక్ రక్షోహామీ చాతనః

- సం. - కాం. 4; ప్ర. 2; అను. ; పన. 2

(రాజులు యుద్ధంలో శత్రువులను జయించడం కోసం కలిసినట్లు ఓషధులు పొలంలో ఫలమివ్వడం కోసం కలుస్తున్నాయి. వీటి రసం, వీర్యం, భావనం ఎరిగిన పురుషుణ్ణి భిషక్ అంటారు. ఇతడు పండిన ఓషధులతో పురోడాశాదులను తయారుచేసి రాక్షసుల వల్ల కలిగే ఉపద్రవ రూప మయిన రోగాలను తొలగిస్తాడు. ఓషధులతో పథ్యం ఏర్పరచి, దాని ద్వారా రోగాలను నాశం చేస్తాడు.)

ఇక్కడ ఓషధుల వల్ల రోగాలను నాశం చేయడం, పథ్యం ద్వారా రోగనాశం పేర్కొనబడ్డాయి. ఏ రోగానికి ఏది పథ్యమో ఏది అపథ్యమో ఆయుర్వేదం బాగా విస్తరించింది.

మూ యస్తే యక్ష్మం విబాధన్తా ముగ్రో మధ్యమశీరివ

సాకం యక్ష్మ ప్రపత శ్యేనేన కికిదీవినా

సాకం వాతస్య ధ్రాజ్యా సాకం నశ్య నిహాకయా

- . -5%. 4; 5. 2; . 6; 2. 4

(నీ శరీరాన్ని ఆక్రమించిన ఓషధుల రసరూపంలో ప్రతి పర్వలో ప్రవేశించి నీ రోగాన్ని విశేషంగా నాశం చేయుగాక. పక్షపాతం లేని రాజు దుష్టులను కఠినంగా శిక్షించినట్లు ఓషధులు రోగాలను నశింప జేయాలి. కంఠంలో శ్లేష్మం ఉండడం వల్ల కీ, కి అనే శబ్దం కలిగించే రోగం కికి దీవి. డేగవలె తీవ్రతరంగా ఉండే పిత్తం వల్ల కలిగే రోగం శ్యేనం. వీటితో గూడిన రాజయక్ష్మ రోగం నశించాలి. 'బాధతో చచ్చిపోతున్నాను. అయ్యో కష్టం' అని ఏడ్పించే రోగం నిహాక. దీనితో గూడిన రాజయక్ష్మ రోగం నశించాలి.)

మూ: మావో రిషత్ప్రనితా యసై#ద్మ చాహం ఖనామి వః

ద్విప చ్చతుష్ప దస్మాకగ్ం సర్వ మస్త్వనాతురమ్

(ఓషధులారా! చికిత్స కోసం మీ మూలాన్ని త్రవ్వేవాడు నశించకూడదు. ఏ రోగికి వైద్యం చేయడం కోసం నేను త్రవ్వుతున్నానో ఆ రోగి కూడా నశించకూడదు. మాకు సంబంధించిన ద్విపాదజీవులు (మానవాదులు) చతుష్పాదజీవులు (పశువులు) రోగం లేనివారు కావాలి. (పై గ్రంథం)

పై మంత్రాల వల్ల వేదంలో సేద్యం, 14 రకాలయిన ధాన్యాలను పండించడం, వ్రేళ్ళను, ఓషధులను రోగనివృత్తికి వినియోగించడం, 12 ఎద్దులు, 6 కాడులు ఉండే పెద్ద నాగళ్ళ వినియోగం ఉన్నాయని స్పష్టమవుతోంది.

Tuesday, October 1, 2024

అక్షౌహిణి అంటే?

"అక్షౌహిణి అంటే?"
                 17-01-2024
ఒక యుగంలో లేదా ఒక కాలంలో ఆ ప్రజల జీవన విధానాలు మరియు ఆచార వ్యవహారాలతో పాటుగా అనేక అంశాలలో ఆ యుగం క్రొత్తయుగంలోకి అడుగుపెట్టే కొద్దీ మార్పులు రావడం సహజం. అలాగే సైన్య సంఖ్యా విషయంలో కూడా. అంటే కృతయుగానికి,త్రేతాయుగానికి, ద్వాపర యుగానికి ఇలా ప్రతి యుగంలోనూ రాజులు సైన్యాన్ని ఏర్పరచి నియమిత సంఖ్యకు ఒక్కో పేరు పెట్టడం జరిగింది. కలియుగంలో ఆధునిక భావజాలం ప్రసరించింది. కాబట్టి ఇప్పటి సైన్యంలో అనేక రకాల స్థాయిలు వాటి సంఖ్య పరిమితి వాటి పేర్లు పూర్తిగా భిన్నంగా మారిపోయాయి.ద్వాపరయుగంలో అంటే కురుక్షేత్ర యుద్ధకాలంలో కౌరవుల వైపు 11 అక్షౌహిణుల సైన్యం,పాండవుల వైపు 7 అక్షౌహిణుల సైన్యం హోరాహోరీగా పోరాడినారు. శ్రీ మదాంధ్ర మహాభారతంలో నన్నయ వ్రాసిన ఆది పర్వంలోని ప్రథమాశ్వాసంలో భారత సంహిత నిర్మాణ ప్రశంస అనే విషయంలో 69వ పద్యం ఈ విషయాన్ని తెలుపుతున్నది.
సీసము:
వరరథమొక్కండు వారణమొక్కండు
     తురగముల్ మూఁడు కాల్వురునునేవు
రనుసంఖ్య గలయదియగుఁబత్తి యది
     త్రిగుణంబైన సేనాముఖంబు దీని
త్రిగుణంబైన గుల్మంబు,దీనిముమ్మడుఁగగు
      గణము తద్గణము త్రిగుణితమైన
వాహినియగు దానివడిమూట గుణియింపఁ
      బృతనాఁబరగుదత్ పృతనమూఁట
ఆటవెలది:
గుణితమైనఁజమువగున్ మఱిదాని ము
మ్మడుఁగనీకినీ సమాఖ్యనొనరు
నదియుఁబదిమడుంగులైన నక్షౌహిణి
యౌ,నిరంతరం ప్రమాను సంఖ్య.

1. వరరథం(శ్రేష్ఠమైన రథము)  1
    వారణము(ఏనుగు)             1
    తురగములు(గుఱ్ఱాలు)       3
    పదాతి(సైనికులు)               5
   ఈ మొత్తాన్ని"పత్తి" అంటారు.
2."పత్తి"ని మూడుచే గుణించగా వచ్చే 
    సైన్యం పేరు "సేనాముఖము".
   రథాలు                                3
   ఏనుగులు                            3
   గుఱ్ఱాలు                              9
   సైనికులు                            15
   ఈ మొత్తాన్ని "సేనాముఖము" అంటారు.
3."సేనాముఖము"ను మూడుచే గుణించగా
    వచ్చే సైన్యము పేరు "గుల్మం".
    రథాలు                              9
    ఏనుగులు                         9
    గుఱ్ఱాలు                         27
    సైనికులు                        45
    ఈ మొత్తాన్ని "గుల్మం" అంటారు.
4."గుల్మాన్ని" మూడు చేత గుణించగా వచ్చే
    సైన్యము పేరు "గణం".
    రథాలు        27
    ఏనుగులు    27
    గుఱ్ఱాలు       81
    సైనికులు    135
     ఈ మొత్తాన్ని " గణం" అంటారు. 
5."గణాన్ని" మూడుచే గుణిస్తే వచ్చే సైన్యము పేరు
   "వాహిని".
    రథాలు           81
    ఏనుగులు       81
    గుఱ్ఱాలు       243
    సైనికులు      405
    ఈ మొత్తాన్ని  "వాహిని" అంటారు.
6."వాహిని"ని మూడు చేత గుణిస్తే వచ్ఛే సైన్యము
    పేరు "పృతన".
    రథాలు            243
    ఏనుగులు        243
    గుఱ్ఱాలు          729
    సైనికులు        1215
    ఈ మొత్తాన్ని "పృతన" అంటారు.
7."పృతన"ను మూడు చేత గుణించగా వచ్చే
    సైన్యము పేరు "చమువు"
    రథాలు            729
    ఏనుగులు        729
    గుఱ్ఱాలు        2187
    సైనికులు       3645
    ఈ మొత్తాన్ని  "చమువు" అంటారు.
8."చమువు"ను మూడుచేత గుణించగా వచ్చే
    సైన్యము పేరు "అనీకిని".
    రథాలు            2187
    ఏనుగులు        2187
    గుఱ్ఱాలు           6561
    సైనికులు        10935
    ఈ మొత్తాన్ని " అనీకిని"అంటారు
9."అనీకిని"ని పది చేత గుణించగా వచ్చే సైన్యము
    పేరే "అక్షౌహిణి".
    రథాలు              21870
    ఏనుగులు          21870
    గుఱ్ఱాలు             65610
    సైనికులు          109350
    ఈ మొత్తాన్ని" ఒక అక్షౌహిణి "అంటారు.

      పై సమాచారాన్నిబట్టి పాండవుల వద్దగల 
     7 అక్షౌహిణుల సైన్యంలో గల రథ,గజ,తురగ
     పదాతుల సంఖ్య.
10.రథాలు            153090
      ఏనుగులు        153090
      గుఱ్ఱాలు           459270
      సైనికులు          765450
     ఈ మొత్తాన్ని"7అక్షౌహిణుల" సైన్యమంటారు.
     
     అలాగే కౌరవుల వద్ద గల 11అక్షౌహిణుల
     సైన్యంలో గల లథ,గజ,తురగ,పదాతుల
     సంఖ్య.
11.రథాలు                240570
      ఏనుగులు            240570
      గుఱ్ఱాలు               721710
      సైనికులు            1202850
     ఈ మొత్తాన్ని "11 అక్షౌహిణుల" సైన్యం
     అంటారు.
      పాండవుల,కౌరవుల మొత్తం 18 అక్షౌహిణుల
      మొత్తం సైన్యం.
      రథాలు               393660
      ఏనుగులు           393660
      గుఱ్ఱాలు           1180980
      సైనికులు          1968300
      పైన తెలుపబడిన సైనిక సంబంధ విషయాలు
      ద్వాపరయుగ భారతీయ సైన్య 
      సంబంధమేగాని విదేశీ సైనిక వ్యవస్థకు 
      వర్తించదు.            
సేకరణ:-ద్రోణంరాజు శ్రీనివాసరావు

Wednesday, September 18, 2024

సనాతన

జంబుద్వీపే భరతవర్షే భరతఖండే

సంకల్ప మంత్రంలో వచ్చే పదాలు "జంబుద్వీపే భరతవర్షే భరతఖండే" అనేవి మనమందరం వినే ఉంటాము. మన హిందు ఆచారాలలో ఈ సంకల్ప మంత్రం ఒక అంతర్భాగం.

అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?

జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. జంబుద్వీపంలో ఆసియా, ఐరొపా,ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబుద్వీపాన్ని 9 వర్షాములుగా(భౌగోళిక ప్రాంతాలు) విభజించారు. వాటిలో మన భరతవర్షం ఒకటి. మిగిలిన 8 వర్షములు ఇవి:

1) కేతుముల వర్ష 2) హరి వర్ష 3) ఇలవ్రిత వర్ష 4) కురు వర్ష 5) హిరణ్యక వర్ష
6) రమ్యక వర్ష 7) కింపురుష వర్ష 8 ) భద్రస్వ వర్ష

(స్పష్టంగా అవగాహన రావడానికి చిత్రాన్ని చూడండి. Check the picture for clear idea.)

పూర్వం భరతవర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్, బలుచిస్తాన్, ఇరాన్, సుమేరియా, క్యాస్పియన్ సముద్రం(ఒకప్పుడు కష్యప సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఈ భరతవర్షంలో ఉండే భరత ఖండం(ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం) వైదిక సంస్కృతి/నాగరికత కు ఆత్మ వంటిది. పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అబద్ధం అనడానికి ఇలాంటివి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి. మనల్ని తక్కువ చేయడానికి ఈ సిద్ధాంతాన్ని సృష్టించారు. ఈ సిద్ధాంతంలో చెప్పిన అన్నీ ప్రాంతాలు భరత వర్షంలో ఉన్నాయి. కాబట్టి ఆర్యులనే వారు ఎవరు దండయాత్ర చేయలేదు.

ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే మన పూర్వీకులకు ప్రపంచ భూగోళ శాస్త్రం గురించి బాగా తెలుసు.

మనం గమనించాల్సింది ఇంకొకటి ఉంది. అప్పుడు చాలా వరకు దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండంలొ దక్షిణ భాగంలో సగం, మరియూ ఆస్ట్రేలియా మొత్తం నీటి కింద ఉండేవి. ఇంకొకవైపు ఇప్పుడు అట్లాంటిక్ మహా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం గా పిలవబడేవి సముద్ర మట్టానికి పైన ఉండేవి.

దీన్ని బట్టి నిరూపితమైనది ఏమిటంటే వైదిక సంస్కృతి కేవలం 5000 సంవత్సరాల క్రితమే పుట్టిందని, కురుక్షేత్రం కేవలం కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పేవారివి తప్పుడు ప్రచారాలు మరియు పచ్చి అబద్ధాలు. ఆస్ట్రేలియా నీటి కింద ఉన్నపుడే వైదిక నాగరికత ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనది ఎంత పురాతనమైన నాగరికత అని !

మనల్ని దిగ్బ్రాంతికి గురిచేసే విషయం ఏమిటంటే మన ప్రభుత్వం ఇంకా మన పాఠ్య పుస్తకాలలో ఇటువంతి అబద్ధపు సిద్ధాంతాలను, భారత దేశానికి వ్యతిరేకంగా, భారత దేశాన్ని/భారతీయులను తక్కువచేసి చూపించే తప్పుడు చరిత్రను బోధిస్తుంది. మన ప్రభుత్వం దేశ యువతకు మన పూర్వికులు పామరులు/ఏమి తెలియని వాళ్ళు అని బోధిస్తుంది. దేశ భక్తులు కనుగొన్న నిజమైన చరిత్రను బోధించడం లేదు.

మన పాఠ్య పుస్తకాలలో మన ఋషుల గురించి పెట్టాలి అనే ప్రతిపాదన తెచ్చినపుడు విద్యావ్యవస్థను కాషాయమయం(Saffronisation) చేయొద్దని తిరస్కరించాయి. తమ సొంత దేశం యొక్క గొప్పతనాన్ని తిరస్కరించి మన పూర్వీకులను మనమే చిన్నచూపు చూసే దేశం ఎదైనా ఉంటుందా? ఏం మన ఋషులు భారతీయులు కాదా? వారి గురించి మన పాఠ్య పుస్తకాలలో ఎందుకు ఉండకూడదు?

ఏ రాజకీయ పార్టీ అయినా/ప్రభుత్వం అయినా దేశ సంస్కృతిని/పూర్వీకులను గౌరవించాలి. ఇప్పటికైనా భారతీయులు మేలుకోవాలి. మనం ఎంత గొప్ప సంస్కృతికి వారసులమో గ్రహించి మన సంస్కృతిని కాపాడుటకు మనవంతు కృషి చేయాలి.,,✍✍✍

Monday, May 20, 2024

రాజు గారి ఏడుచేపల కథ పరమార్థః

ఏడు చేపల కధ అర్ధం పరమార్ధం...
వీలైనంత ఓపికగా చదవండి...
ఏడు చేపల కథ చిన్న పిల్లలకు ఎంతో పరిచయం ఉన్న కథ మళ్ళీ మళ్ళీ అడిగి చెప్పించుకునే కథ. 
అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. 
ఏడుగురు కొడుకులు ఒకనాడు వేటకు వెళ్ళి ఏడు చేపలను వేటాడారు.
వేటాడిన చేపలను ఎండబెట్టారు.
అందులో ఒక చేప ఎండలేదు. 
చేపా, చేపా ఎందుకు ఎండలేదు అని అడిగారు. 
గడ్డిమేటు అడ్డొచ్చింది అంది. 
గడ్డిమేటు ?
గడ్డిమేటా ఎందుకు అడ్డొచ్చావ్‌ అని అడిగారు. 
ఆవు మేయలేదు అంది. 
ఆవూ, ఆవూ ఎందుకు మేయలేదు అని అడిగారు?
గొల్లవాడు నన్ను మేపలేదు అంది.
గొల్లవాడా !
గొల్లవాడా ఆవును ఎందుకు మేపలేదు అని అడిగారు. 
అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు.
అమ్మా అమ్మా ఎందుకు అన్నం పెట్టలేదు అని అడిగారు. 
పిల్లవాడు ఏడ్చాడు అంది. 
పిల్లవాడా పిల్లవాడా ఎందుకు ఏడ్చావ్‌ అని అడిగారు. 
చీమ కుట్టింది అన్నాడు. 
చీమా చీమా ఎందుకు కుట్టావ్‌ అన్నారు.
నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అంది.
ఎన్నో అసహజాలు, అసంగతాలు అయిన సన్నివేశాలు ఉన్నా, ...
రీజనింగ్‌ అడగకుండా, ఆలోచించకుండా వినే గొప్ప తెలుగు కథ ఈ ఏడు చేపల కథ. 
నిజానికి రాజుగారి కొడుకులకు చేపలు వేటాడాల్సిన కర్మ ఏం పట్టింది.
అడవికిపోయి క్రూర మృగాలను వేటాడవచ్చు కదా! 
అయినా ఎవ్వరూ ఈ ప్రశ్న వేయరు.
చెరువుకు పోయి చేపలు తెచ్చారే అనుకుందాం. 
వాటిని ఎండబెట్టడానికి, ఎండిన వాటిని ఎత్తిపోసుకోవడానికి వారి దివాణంలో నౌకర్లే కరువయ్యారా !
నిజానికి ఈ ప్రశ్న ఎంతో వ్యాలిడ్‌ ప్రశ్న. అయినా ఎవ్వరూ ఈ కోణం నుంచి ప్రశ్న వేయరు. 
ఎవ్వరూ అడగలేదు కదా అని రీజనింగ్‌ ఇవ్వకపోవడం ఒక మంచి రచయిత లక్షణం కాదు. 
అందుకే ఈ కథను జాగ్రత్తగా గమనిస్తే, చదువుకుంటే అనేక అంతరార్థాలు, పైకి కనిపించని విశేషాలు స్ఫురిస్తాయి. 
రాజుగారు అంటే మనిషి. 
ఆయనకు ఏడుగురు కొడుకులు అంటే మనిషిలోని సప్తధాతువులు. 
కొడుకులు వేటకు వెళ్ళడమూ అంటే మనిషి జీవితాన్ని కొనసాగించడం.
జీవితమే ఒక వేట. వేటే ఒక జీవితం.
రాజ కుమారులు వేటాడిన ఏడు చేపలు అంటే 
మనిషికి ఉండే అరిషడ్ వర్గాలు ( అనగా 6 )
1.కామ 2.క్రోధ 3.లోభ 4.మోహ 5.మద 6.మాత్సర్యాలు 
వీటన్నింటిని మనిషి సాధన చేసి ఎండగట్టవచ్చు.
అంటే పూర్తిగా నియంత్రించవచ్చు.
అందుకే కథలో ఆరు చేపలను ఎండగట్టినట్టు చెప్పారు. 
రాజుగారి కొడుకులు ఎండబెట్టిన ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు.
ఏమిటా చేప. అది మనస్సు  
దీన్ని జయించడం చాలా కష్టం. 
ఎంత ప్రయత్నించినా అది ఎండదు. 
మనస్సు అంటే ఏమిటి !
మనస్సు అంటే సంకల్ప వికల్పాలు 
ఒకటి తీరుతుంటే మరొకటి మొలుచుకొస్తుంది.
మొలిచే కోరికలను తీర్చుకుంటూ పోతుంటే జీవితకాలం చాలదు.
కోరికలన్నింటిని జయించేసి మోక్షానికి వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ ఆరాట పడుతుంటారు.
మోక్షానికి వెళ్ళాలనుకోవడం కూడా ఒక కోరికే.
ఆ కోరికను ఎండగడితే తప్ప మోక్షం రాదు. 
ఈ చేప ఎండకుండా అడ్డు తగులుతున్నది ఏది !
గడ్డిమేటు.
గడ్డిమేటు అంటే ఏమిటి
కుప్పపోసిన అజ్ఞానం.
గడ్డిమేటలా పేరుకుపోయిన అజ్ఞానాన్ని తొలగించాలంటే ఎలా !
మామూలు గడ్డికుప్ప అయితే గడ్డిపరకలను పట్టి లాగీ, పీకి ఒకనాటికి ఖాళీ చేయవచ్చు.
కానీ అజ్ఞానం అలాంటిది కాదు. జ్ఞానాదాయకమైన మాటలు ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా మనం చేత్తో గడ్డిపరకలను లాగినట్టే !
ఆ కుప్ప తరిగేది కాదు, తగ్గేది కాదు.
దాన్ని ఎంత ప్రయత్నించినా తగ్గించడం కష్టం.
మరి అది పోవాలంటే ఏం చేయాలి !
ఆవు వచ్చి మేయాలి.
ఆవు ఎక్కడి నుంచి రావాలి. అసలు ఆవు అంటే ఏమిటి !
ఆవు అంటే జ్ఞానం.
జ్ఞానం అనే ఆవు దొడ్లో ఎగబడి మేస్తే అజ్ఞానం అనే గడ్డికుప్ప ఒకనాటికి అంతరించి పోతుంది.
లేదూ… జ్ఞానాన్ని అగ్నికణంగా మార్చి గడ్డిమేటు మీద వేస్తే కాలి బూడిదవుతుంది.
అందుకే భగవద్గీతలో మన కర్మలు, వాటి ఫలితాలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోవాలని చెబుతాడు కృష్ణుడు
(జ్ఞానాగ్నిదగ్ధకర్మాణాం)
జ్ఞానాన్ని అగ్నిగా మలుచుకోగలిగిన వాడు సిద్ధపురుషుడు, యోగ పురుషుడు మాత్రమే. 
ఈ గోవును ఎవ్వరు మేపాలి. 
గొల్లడాడు మేపాలి. గొల్లవాడు అంటే ఎవరు !
సమర్ధ సద్గురుడు, జగద్గురుడు.
జ్ఞానరూపమైన భగవద్గీతను లోకానికి ప్రసాదించిన కృష్ణుడు గొల్లవాడే కదా !
అర్జునుడు అనే దూడను అడ్డు పెట్టుకుని వేదం అనే ఆవు పాలు పిండి జ్ఞానరూపంగా మనందరికి ధారపోశాడు. 
ఇంత గొప్పపని చేయవలసిన ఈ గొల్లవాడు ఆ పని చేయలేదు.
ఏమిరా నాయనా ! ఆవును ఎందుకు మేపలేదు అని అడిగితే అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు. 
ఇంతకీ ఆ గొల్లవాడికి అన్నం పెట్టాల్సిన అమ్మ ఎవరు !
అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ. ఆమెనే లోకం జగన్మాత అని కీర్తిస్తుంది.
ఈ జగన్మాత అన్నం పెట్టక పోవడం వల్ల గొల్లవాడి ఆకలి తీరలేదు. 
ఓ జగన్మాతా ఈ గొల్లవాడికి ఎందుకు అన్నం పెట్టలేదమ్మా అంటే ఆవిడ పిల్లవాడు ఏడ్చాడు అంది.
ఇంతకి ఆ పిల్లవాడు ఎవరు! ఆర్తితో దైవానుగ్రహం కోసం అలమటించేవాడు. 
ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు !
వాడికి చీమ కుట్టింది. ఎక్కడిది చీమా ! దానికి ఇంకోపేరే సంసారం.
సంసారం అనే చీమ కుట్టినందుకు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు.
ఆవులను మేపడానికి వచ్చే గొల్లవాడికన్నా ఆర్తితో దైవానుగ్రహం కోసం ఏడ్చే పిల్లవాడే ముఖ్యం కనుక ఆ పిల్ల వాడినే చూసుకుంది.
మరి గొల్లవాడు అమ్మ అన్నం పెట్టక పోవడం వలన తన విధిని నిలిపి వేసాడా? లేదు. 
అమ్మ ద్వారా తన పనిలో భాగమైన శిష్ట రక్షణను చేసుకున్నాడు.
చీమకుట్టినందుకు కథలో పిల్లవాడు ఏడ్చినట్టే సంసార బాధలు, ప్రపంచ బాధలు భరించలేక మనం కూడా ఏడుస్తున్నాం,
మనల్ని ఈ బాధలే చీమలై కుడుతున్నాయి. 
చీమలు పుట్టలోనే ఉంటాయి. ఏమిటీ ఈ పుట్ట.
మనిషికి ఉండే సంసారం ఒక పుట్ట. 
ఈ పరమార్థాన్ని చెప్పడం కోసమే జీవితంలోకి అడుగు పెట్టే ముందే ఈ గొప్ప విషయం తెలియాలనే సదుద్దేశంతోనే మన పెద్దలు ఈ కథను ప్రతి పిల్లవాడికి నూరిపోశారు.

Wednesday, January 3, 2024

kakubhushunda

[04/01, 11:26 am] Siva Kumar: ఒకసారి వశిష్ట మహర్షి స్వర్గలోకంలో సభ లో ఉండగా అందులో ఒక ఋషి  కాకభూషుండ  కాకి అనే చిరంజీవి గురించి చెప్తాడు అది తెలుసుకోవాలని వశిష్ట మనుషుల వారు మేరు పర్వత స్థానమైన భూలోకంలో ఆయన్ని కలవగా ఆయన ఈ సృష్టి రహస్యాన్ని అతడు ఎప్పటినుంచి చూస్తాడో అన్ని వివరాలను ఈయనకు తెలియజేశాడు. ఆ కాకుబుషుండ ఎవరో తర్వాత తెలిసుకుందాం.  కానీ ఆయన చెప్పిన విశేషాలు ఏందో ఇప్పుడు తెలుసుకుందాం ఇది కొంచెం ఎక్కువ  ఉంటుంది కాబట్టి వివిధ భాగాలుగా వస్తుంది. ఇది  యోగా వాసిష్టంలోని గ్రంథంలోని సారాంశం.
[04/01, 11:26 am] Siva Kumar: _Introduction story skipped_
[04/01, 11:26 am] Siva Kumar: Part 1
వసిష్ఠ - భుశుండ సమాగమం
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రాఘవా! యోగమార్గము గురించి, తద్వారా సంకల్పశమము గురించి, కాలముయొక్క అతి విచిత్రమైన 'గతి' గురించి, సృష్టిపరంపరల చమత్కారం గురించి విశదీకరించగల ఒక సంవాదమును నీకు వివరిస్తాను. ఈ సంవాదము నాకు 'భుశుండుడు' అను పేరుగల కాకి జాతివాడగు యోగితో జరిగింది. ఆ మహానుభావుని అనుభవములేమిటో చెబుతాను విను.
'పరబ్రహ్మము' (universe) అనబడే మహాసాగరంలోని జలకణము వంటి ఒక అల్పవిభాగంలో ఈ జగత్తులన్నీ వెలయుచున్నాయి. ఈ సృష్టికి కారణస్వరూపుడుగా కమల సంభవుడగు బ్రహ్మదేవుడు వెలయుచున్నారు. అట్టి బ్రహ్మదేవుని యొక్క సంకల్ప మానస పుత్రుడను నేను. తపోధ్యానముల బలం చేత సప్తర్షిమండలంలో స్థానం (star of Mizar) సంపాదించాను. వైవస్వత మన్వంతరం వరకు నేను ఇట్లే ఉండబోవుచున్నాను.(18,57,60,000 సంవత్సరాలు ఇంకా ఉన్నాయి ఈ మన్వంతరానికిఅంటే ఆ యొక్క ఒక్క నక్షత్రం లేదా ఆ యొక్క మహర్షి ఇన్ని సంవత్సరాలు ఇంకా ఉంటారని అర్థం చేసుకోవచ్చు తర్వాత ఫార్మేషన్ మారుతుంది అది వేరే సంగతి years left for vaivaswatha manu)
అట్టి నేను ఒకానొకనాడు ఏదో సందర్భంలో స్వర్గంలోని ఇంద్రసభకు వెళ్లాను. అక్కడి సభలో ఈ నారదుడు మొదలైన మహర్షులందరూ ఉన్నారు. అప్పుడు జరిగిన ప్రసంగంలో ‘చిరంజీవత్వం’ గురించి సంభాషించుకోవటం జరిగింది. అప్పుడు శతతాపుడు అనే పేరుగల ముని లేచి నిల్చున్నారు. ఆయన “మాననీయుడు, ప్రమాణకుశలుడు, అవసర మాత్ర ప్రసంగి" అని ప్రసిద్ధి. సభంతా నిశ్శబ్దమైనది. శతతాపముని ప్రసంగించటం ప్రారంభించారు.
శతతాపముని : ఓ సభికులారా! మీరంతా 'చిరంజీవత్వం' గురించి అనేక విశేషాలు చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంలో ప్రత్యక్షసాక్షియగు ఒక చిరంజీవుని గురించి చెబుతాను వినండి.


.సుదీర్ఘ సృష్టి చమత్కారం
శ్రీవసిష్ఠ మహర్షి : అత్యంత దీర్ఘాయువు కలిగి, మోక్షమును అధిరోహించినట్టి అనుభూతిని అనుభవిస్తూ, యోగికి యోగ్యమైన మనస్సును జ్ఞాన విజ్ఞానములను పొంది, అంతులేని ధీరత్వంతో మీరు ప్రకాశిస్తు న్నారు. సర్వమూ కాలయమునకు 'ఎర' (birth and death) అగుచుండగా మీరు మాత్రం మీ ధారణా శక్తిచే కాలముచే బంధింపబడకుండా ఉన్నారు. పురాతన విషయములన్నీ ప్రత్యక్షంగా చూచిన మీరు అనేక విషయములు చెప్పుటకు సమర్థులు. ఓ మంగళహృదయా! అనేక విధములగు సృష్టులను(orgin for universe), ప్రతిసృష్టులను(clusters), సామాన్య ప్రళయములను , అవాంతర ప్రళయములను, మహాప్రళయములను చూచిఉన్నారు కదా! ఆ సృష్టులలో ఏఏ ప్రత్యేక విషయములు సందర్భోచితమో... అవి చెప్పమని నా విన్నపం. 

భుశుండుడు : మహాత్మా! వినండి - ఈ సుమేరుపర్వతం క్రిందగల భూమి అంతా వృక్షములు గాని, గడ్డిగాని, శైలము (Rock) గాని లేక, కేవలం శూన్యంగా ఉండటం చూచాను (gas formation). భూమి 11000 సంవత్సరాల కాలం భస్మరాశితో (lava) నిండి ఉన్నది. అప్పుడు భూమిపై సూర్యుడు గాని, చంద్రుడు గాని లేకపోవటం చేత పగలు రాత్రి భేదమే ఉండేది కాదు (gas clouds). కాలమునకు కొలతబద్ద లేకపోయినా (time) నేను నా విజ్ఞానదృష్టితో సూర్యచంద్రుల కంటే విశిష్టమైన కాలగమనాన్ని గమనించాను.
భూమి సగం పగలు, సగం రాత్రితో కొంతకాలం ఉండిపోయింది. దేవాసుర సంగ్రామ సమయంలో జనులు భూమిలోని అంతర్భాగంలో దాగి ఉండుటచే ఈ భూమి కొంతకాలం జన శూన్యమైపోయింది. (No  living species)

Tuesday, July 11, 2023

ధ్రువ నక్షత్రం సైన్స్

ఖగోళశాస్త్రంలో "ఎవరు ముందు?" అనేది ఒక చిక్కు ప్రశ్న? ముఖ్యంగా "ప్రాచ్యులు ముందా? పాశ్చాత్యులు ముందా?" అన్న ప్రశ్న వచ్చేసరికల్లా, "అన్నీ మా వేదాల్లోనే ఉన్నాయి" అని మనవాళ్ళంటారు, "మీ మొహం మీకేమీ తెలియదు" అని మనని మన ప్రజ్ఞని పాశ్చాత్యులు కించపరుస్తూ ఉంటారు. ఈ తగవు రివాజు అయిపోయింది. ఈ పరిస్థితికి కారణం ఆధారాలు చూపించకుండా మాట్లాడే మన అలవాటు కావచ్చు.

ఈ తగవుని నేను పరిష్కరించలేను కాని, మహీధర నళినీమోహన్ "నక్షత్రవీధుల్లో భారతీయుల పాత్ర" లో ఉదహరించిన ఆధారం ఒకటి ముచ్చటిస్తాను. మహాభారతం వ్యాస ప్రణీతం. అది లిఖితరూపం లోకి ఎప్పుడు వచ్చిందో తెలియదు కాని, భారతయుద్ధం తరువాత జనమేజయుడు చేసిన సర్పయాగంలో సూతుడు ఈ కథ చెబుతాడు. ఇది కలియుగపు ప్రారంభంలో జరిగింది. అంటే దరిదాపు 5000 సంవత్సరాల కిందట. కనుక మహాభారత కాలం ఉరమరగా, కొంచెం ఇటూ అటూ గా, 5000 ఏళ్ళ క్రితం నాటిది.

ఈ సంస్కృత భారతంలో IV-9-19, 20, 21, 22 శ్లోకాలలో ధ్రువుడికి విష్ణుమూర్తి ఇచ్చిన వరం వ్యాసుడు ఇలా వర్ణిస్తాడు.

"వేదాహంతే వ్యవసితం హృదిరాజన్య బాలక!

యత్రగ్రహార్ష తారాణాం, జ్యోతిషాం చక్రమాహితం

మేధ్యాం గోచక్రవత్‌స్థాస్ను, పరస్తాత్ కల్పవాసినాం

ధర్మోగ్నిః కశ్యపః శుక్రో, మునయోయేవ నౌకసః

చరంతి దక్షిణీకృత్య, భ్రమంతోయత్సతారకాః

షడ్వింశద్వర్ష సాహస్రం, రక్షితా వ్యాహతేంద్రియః

ఈ శ్లోకాన్ని ఆంధ్ర భాగవతంలో బమ్మెర పోతన ఈ విధంగా తెలిగించేడు.

"క. ధీరవ్రత! రాజన్యకు

మారక! నీ హృదయమందు మసలిన కార్య

బారూఢిగా నెరుంగుదు

నారయనది పొందరానిదైనను నిత్తున్

వ. అది యెట్టిదనిన నెందేని మేధి యందు పరిభ్రామ్యమాణ గోచక్రంబునుంబోలె గ్రహనక్షత్ర తారాగణ జ్యోతిశ్చక్రంబు నక్షత్రరూపంబులైన ధర్మాగ్ని కశ్యప శుక్రులును, సప్తఋషులును తారకా సమేతులై ప్రదక్షణంబు తిరుగుచుండుదురు. అట్టి ధ్రువ క్షితియను పధంబు ముందట ఇరువదియారువేల యేండ్లు సనం బ్రాపింతువు."

దీన్ని మనందరికీ అర్ధం అయేలా చెప్పుకోవాలంటే రాట (మేధి) చుట్టూ ఆవు తిరిగిన మాదిరి ఆకాశంలో ధ్రువ నక్షత్రం చుట్టూ ఉండే నక్షత్రాలు వలయాకారంలో తిరగటానికి 26,000 ఏండ్లు పడుతుందని వ్యాసుడు చెపుతూనట్టు నాకు అర్ధం అయింది. ఈ 26,000 ఏండ్ల వలయం భారతంలో ఉందంటే కనీసం 5000 ఏండ్ల క్రితమే ఈ విషయం మనవాళ్ళకి తెలుసన్నమాట. అంటే సాధారణ శకానికి 3000 సంవత్సరాల క్రిందట అన్న మాట.
భూ  అక్షం స్థిరంగా ఉండదనిన్నీ, అంటే భూ అక్షం ఎల్లప్పుడూ ధ్రువ నక్షత్రం వైపే చూపిస్తూ ఉండకుండా, ధ్రువ నక్షత్రం చుట్టూ 26,000 ఏళ్ళకో ప్రదక్షిణం చొప్పున వలయాకారంలో తిరుగుతూ ఉంటుందనిన్నీ గ్రీకు శాస్త్రవేత్త హిపార్చస్ సాధారణ శకానికి పూర్వం 143 లో కనుక్కున్నాడు. ఈ చలనాన్ని సంస్కృతంలో విషువచ్చలనం అనిన్నీ, ఇంగ్లీషులో precession of the equinoxes అనిన్నీ అంటారు. భారతంలోని శ్లోకాన్ని బట్టి ఈ విషయం పాశ్చాత్యులకంటె కనీసం రెండు సహస్రాబ్దాల ముందే మనవాళ్ళకి తెలిసిందని ఋజువు అవటం లేదూ?

విషువచ్చలనం అతి స్వల్పం. అంటే ఏడాదికి ఉరమరగా ఒక నిమిషం (భాగ లేదా డిగ్రీలో 60 వ వంతు). ఇంత స్వల్పమైన కదలిక యొక్క ప్రస్తావన కవిత్వంలోకి వచ్చేసిందంటే దీన్ని గమనించి, నమోదు చెయ్యటం అంతకు ముందు ఎప్పుడో జరిగి ఉంటుంది.

garuda story inner meaning

How to understand the Puranas "Puranethi Navam" means that the Purana will always be new no matter how often it is read. Did the P...