Friday, January 27, 2023

గజపతుల నాటి కథలు

#story
గజపతుల నాటి కథలు
కాంట్రాక్టర్ సోమన్న అనే ఈ గజపతుల నాటి కథ. 80 ఏళ్ల ముందు ముద్రించిన పుస్తకంలోనిది. ఇది మిలియన్ బుక్స్ ప్రాజెక్టు నుంచి సేకరించి టెక్స్ట్ రూపంలోకి మార్చి అందించడం జరుగుతుంది. ఈ కథ అప్పటి సంస్కృతి వారి యొక్క నిజాయితీ తెలుపడంలో మనకు దోహదపడుతుంది.
కచ్చితంగా చదివి తీరవలసిన కథ....
6. కాంట్రాక్టరు సోమన్న....
దివాను జగన్నాధరాజుగారు తన దగ్గర నున్న కాగితా
లను చూచుకుంటూచే, ఎదుట కొంచెం దూరంలో
చేతులు కట్టుకుని నించుని వన్న దరఖాస్తుదారుని మనవిని వింటూ వున్నాడు,

“మహాప్రభువులు కరుణించాలి! చాలా బీద బ్రాహ్మణుడిని పెద్ద కుటుంబం, ఏమి అధారమూ లేదండి, (పభువుల
అనుగ్రహాంతప్ప ! ఏదన్నా ఉద్యోగం యిప్పించి యీ
కుటుంబాన్ని పోషించాలని ప్రార్థన..

అని ఎదుట నించుని వున్న సోమనాధం వినయ విధేయ
తలతో మనవిచేశాదు,

దివాను సోమనాధం వైవు దృష్టీ మరల్చి “ఏమయినా
ఖాళీలుంకే.. నువ్వింత బతిమాల నక్క న్లేదయ్యా ! మా
సంస్థానం పనీ జరగవలసిందేగా ! అయితే కేమీ! ఇప్పుడే
మిన్నీ ఖాళీలు లేవ” అని అన్నాడు.

సోమనాథం. చేతులు నులువుకుంటూ “చిత్తం,
చిత్తం! ప్రభువులు తలుచుకుంటే ఏ ఖాళీ అన్నా వస్తుంది,
ఈ బీదకుటుంబం వొక్కటి పోషించడం ప్రభువులకి ఒక
'లెక్కలోనిది కాదు' అన్నాడు,

దివాను నిదానించి చూస్తూ “నీ గోడు నువ్వు చెప్పడం
 సబబుగానే ఉంది కానీ నేను తలుచుకుంటే ఏ కాళీ అయినా వస్తుందం సరిగా లేదు. నీకు ఖాళీ కావాలంటే ఎవరినైనా భర్తరఫు (remove) చేయాలన్నమాట నీలాంటి బీదవాడి కుటుంబ పొట్ట మీద కొట్టాలన్నమాట కదూ! విజయనగర సంసారంలో అటువంటి పని ఎన్నటికీ జరగదు అన్నాడు. సోమనాదం గడగడలాడిపోయాడు చిత్తం చిత్తం మరొకరిని భక్తులకు చేసి ఆ పని నాకు పెంచాల్సిన నేను కోరలేదు ప్రభు. సర్వేజనా సుఖినోభవంతు! ధర్మ సంస్థానంలో అలాంటి పని ఎన్నటికీ జరగదు అని తెలుసు. ప్రభువు తమ తెలిస్తే ఏదో ఒక పని కల్పించగలరని ధర్మసంస్థానం ఒక బీద కుటుంబం మలమల మాడిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోదని ధైర్యంతో అలా అన్నాను. ప్రభు జగన్నాధ రాజు గారు కొంచెం ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతం ఏమీ కాయంగా ఉండే నౌకరీలు లేవు అయినా ఆలోచిస్తాం. నువ్వు ఏమి చేయగలవో చెప్పు.
 
 చిత్తం చిత్తం నేను కొంతకాలం ఒక కోమటికు గుమస్తాగా పనిచేశాను. చీఠా ఆవర్జాలు (accounting) బాగా వ్రాయగలరు. ఎలాంటి లెక్కలైనా సులభంగా చేయిస్తాను తికమకల్లో ఉన్న లెక్కల్లో శీఘ్రముగా చిక్కు విడదీయగలను. ఆ కోమటి తన కుమారునికి తరిఫీది ఇవ్వమని చెప్పి వాడు. 
అన్నీ చాగా (గ్రహించాక నాకు ఉద్వాసన
ఇెప్పాడండీ!”

*ఏవయినా ఇళ్లు కట్టించే అనుభవం వుండా? ఏపని
వాళ్లకి ఎంత యిస్తే గిట్టుబాటు అవుకుందో-పని లోటూ,
లొసుగూ లేకుండా జరుగుతుందో తెలుసా!”

“చిత్తం, చిత్తం. చాగా తెలుసునండి, మా సెట్టి
గారు కట్టించిన భవంతిపని నా చేతిమిదుగా నే జరిగింద డి!

అణా, పైసలుతో కూడా లెక్కలు సమంగా అప్పగించే
చాడిని, ఆయన చాలా సంతోషించి నాకు పట్టుశాలీ పంచెలచాపు బహుమానంగా యిచ్చారండి, పని పసందుగా వుందంటూ కితాబు యచ్చారండి.”

“సరే! యిప్పుడు సంస్థానంవారు భీముని పట్నంలో (bheemili)
సముద్రపువొడ్డున_ ఒక బంగళా కట్టించదలచుకని
వున్నారు. ఆ పని చేయించే పూచీ పడితే పని అప్పగిస్తాను,
శావలసిన వస్తువులూ, కలపా మొదలయినవి తగిన ఖరీదుకి సులభంగా సప్లయి అయేటట్లు మేం తాఖీదులు యిస్తాం, ఆరు నెలలు. దాటకుండా బంగళా పసందుగా తయారు కావాలి”
“చిత్తం, చిత్తం, తప్పకుండా తమ ఆజ్ఞ నెర
'వేరుస్తానండి, (ప్రభువులు మెచ్చుకు నేటట్లు చేయిస్తాను.”
“నువ్వు ఆరు నెలలపాటు ఆ పనిని చూడవలసి
వుంటుంది, అహోరాత్రాలు దానిమీదనే కన్ను వుంచాలి,

యాభై వేలు (50,000) దాటకుంకా అయేటట్లు కూడాలి, ఇది నచ్చినట్లు అయితే పని పారంభించవచ్చు”

“చిత్తం. చిత్తం. ప్రభువుల అజ్ఞకి వ్యతిరేకంగా
చెప్పడానికి ఎవరికి సాధ్యమండి; ఏలినవారు. ఎలాతో స్తే అలా అజ్ఞాపించవచ్చు.”

“సరే! సాయంకాలం కనపడు ; అక్కడి ఠాణేడారుకి
'తాఖీదు వ్రాయించి ఉంచుతాము. నువ్వు అడిగినప్పుడల్లా అవసరమైనంత సొమ్ము అతను నీకు ఇస్తూ వుంటాడు, అక్కడి
నౌకర్లు కూడా నీకు సహాయంగా ఉండేటట్టు ఏర్పాటు
చేయిస్తాము.


భీముని పట్నంలో విజయనగరం మహారాజావారి
బంగళా పని సోమనాధం యాజమాన్యం కింద చాలా చురుకుగా జరుగుతున్నది.

.. సోమనాథం తన కుటుంబంతో
కూడా భీముని పట్నంవచ్చి ఒక చిన్నయిల్లు అద్దెకు నిర్ణ
యించుకుని కావురం పెట్టాడు.

రమారమి "రెండు నెలలు గడచాయి.

సోమన్న యిలా శ్రద్ధగా పని చేయిస్తున్నాడు.

దివానుగారి. అజ్ఞ ప్రకారం అతడు. పనికి కుదురు
కున్నాడు; కాని ఈ పనివల్ల తన కెటువంటి లాభమో అత
నికి తెలియదు. ఇంత జీతం యిస్తామని దివానుగారూ చెప్పను లేదు. ఇంత ఇవ్వాలంటూ సోమన్న అడగలేదు. రెండు నెలలు కావచ్చిన ఒక నెల జీతమైనా అందక చాలా ఇబ్బంది పడుతున్నది ఆ బీద కుటుంబం. 
బంగాళా పని నిమిత్తం సోమన్న చేతిలో వేలకొద్దీ డబ్బు ఆడుతూ ఉండేది కానీ అందులో నుంచి ఒక దమ్మిడి కూడా అతను ముట్టడు అలా తీసుకోవడం ద్రోహం అని అతని భావన.
రెండు నెలల జీతము ఒక్కసారిగా వస్తుందని ఆ విషయమై దివాను గారికి దరఖాస్తు పంపడం మర్యాద కాదని సోమన్న అనుకున్నాడు.
 కుటుంబం అవసరాల కోసం చిల్లర అప్పులు చేయవలసి వచ్చింది. రోజులపై రోజులు వారాల మీద వారాలు నెలల మీద నెలలు గడిచి పోతున్నాయి. బంగాళా పని చాలా చురుకుగానే జరిగిపోతున్నది కానీ సోమన్నకు మాత్రం జీవితంలో ఒక దమ్ముడి కూడా అందలేదు. అతను మనసులో చాలా కష్టపడ్డాడు అయినా ఎవరితోని ఈ సంగతి చెప్పడం లేదు బంగాళా పూర్తి అయ్యాక మొత్తంమీద లెక్కలు ఒక్కసారిగా ఇవ్వవచ్చని అనుకున్నాడు. ఇంటి ఖర్చులకోసం అతడు తన దర్భ ముడి ఉంగరానే కాకుండా భార్య మెడలోని మంగళసూత్రాల దగ్గర నుంచి అమ్మ వలసి వచ్చింది ఆ ఇల్లాలు పసుపు కొమ్మ మెడలో కట్టుకోవాల్సి వచ్చింది. బంగాళా పసందుగా తయారైంది.
  ఆ సంగతి సోమన్న దివాన్జీ గారికి తెలియజేశాడు ఐదు నెలలకే అంత పెద్ద బంగళా పూర్తి కావడం దివాను గారికి చాలా సంతోషం కలిగించింది. ఆ మరునాడే ఆయన బంగళాను చూడడం కోసం భీమునిపట్నం వచ్చాడు. సోమనాదం దివాను గారికి బంగళా నాలుగు మూలలకి తీసుకువెళ్లి తాను ఏవిధంగా పని చేయించినది వివరించి చెప్పాడు. దివాను గారు మనసులో చాలా సంతోషించిన బయటికి ఏమి చెప్పడం లేదు. ఆమామ్ బాపతులు ఎంత అయ్యింది ఆయన సోమన్నను అడగను లేదు. సోమన్న తనంతట చెప్పడానికన్నా ఆయన అవకాశం ఇవ్వలేదు.
   రెండు మూడు రోజుల లెక్కలతో పాటు విజయనగరం రావలసింది అంటూ ఆయన తాకీదు మాత్రం ఇచ్చాడు. తన జీతం సంగతి ఏమి చెప్పలేదు అది సోమన్నకు చాలా కష్టం అనిపించింది. విజయనగరం వెళ్లిన మీదట తన సంగతి అంతా మనవి చేద్దామని మనసులో నిశ్చయించుకున్నాడు. దివాను గారు వెళ్లిపోయారు ఆయన ముభావం సోమనాధినికే కాకుండా అతని మీద అభిమానం ఉన్న మరి కొంతమందికి కూడా కష్టమని అనిపించింది. అప్పటికప్పుడే ఆ ఊరిలో కొన్ని వదంతులు పుట్టి నాలుగు మూలలకి అల్లుకున్నయ్. సోమనాదం తగిన మర్యాదలు జరపడం లేదని అందుకనే దివాను గారు ముభావంగా ఉన్నారని కొందరు అనుకున్నారు. బంగళా పని ఆయన సుతారామూ నచ్చలేదని అందుకోసమే తగిన సంజాయిషీ ఇవ్వడానికి విజయనగరం రావాలిసిందంటూ తాఖీదు చేశాడని మరోపక్షం వారి అభిప్రాయం.
    సోమనాదం చాలా డబ్బు కాజేశాడని దివాను గారి అనుమానమని అందుకోసమే లెక్కలతో హాజరుకావాలని అన్నారని మరికొందరి ఊహాగానం.
     ఇవన్నీ సోమనాదం చెవి సోకినాయి అతని ధైర్యం కొంత సడలింది మనసు పరిపరి విధాలుగా పోయింది. ఏమీ నిశ్చయించుకోవడానికి సాధ్యం కాలేదు ఇంతకు తనకు రావలసిన జీతం రాదేమో అని పెద్ద అనుమానం. అతని మనసులో ప్రవేశించింది తాను తన కుటుంబం మలమల మాడుతూ ఎంతో విశ్వాసంతో పనిచేసే వచ్చిన ప్రతిఫలం ఇదా అంటూ మనసులో సోమనాదం కృంగిపోయాడు!
      సోమనాథం జంకుతూ జంకుతూ దివాను గారి కచేరి నావిట్లో ప్రవేశించాడు అక్కడ దివాన్ గారు ఒక్కరూ ఏవో కాయితాలు చూసుకుంటున్నారు సోమనాధాన్ని చూసి అతడు వణుకుతున్న చేతులతో చేసిన నమస్కారాన్ని అందుకొని కూర్చోమని ఆజ్ఞ చేశారాయన కానీ. సోమనాదం కూర్చోకుండా నిలిచి ఉండి దివాను గారి నోటు నుంచి ఏ వాక్యాలు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. దివాన్ గారు సోమనాదం వైపు నిదానించి చూశారు ఇన్నాళ్ళ నుంచి అతను పడుతూ ఉండి కష్టము అతనిలో కనబడుతూ ఉంది చాలా చిక్కిపోయాడు. అతని మొఖం మీద నిరాశ తాండవిస్తున్నది. దివాను జగన్నాథ రాజు గారు సంగతంతా గ్రహించారు. ఇది వరకు కూడా ఇతరుల వల్ల సోమనాదం స్థితులు గతులన్నీ విని ఉన్నాడు. సోమనాదం ఆ లెక్కల కాగితాలు ఇలా ఇచ్చి నువ్వు అబ బెంచి మీద కూర్చుని కాస్త విశ్రాంతి తీసుకో..
       చిత్తం చిత్తం అంటూ సోమనాదం కాగితాలు అందించే జంకుతూ బెంచ్ మీద కూలబడ్డాడు ఆ లెక్కలు చూసి దివాను గారు ఆశ్చర్యపడ్డారు 50 వేలు పైచిలుకు ఖర్చు కాగలదనుకున్న మంగళ పాతిక వేళలోపే తయారు అయినట్లు లెక్కలు స్పష్టంగా కనబడుతున్నాయి. సోమనాదం బంగాళా ఎంతో కావాలని మొదట చెప్పి ఉన్నాము జ్ఞాపకం ఉందా...
        చిత్తం చిత్తం 50,000 అన్నట్లు గుర్తు అయితే ఈ లెక్కలు ఏమిటి పిచ్చి బ్రాహ్మణుడా... అంటూ ఆ కాగితాలన్నీ పర పర అనే చింపి వేశారు సోమనాధానికి ఏమీ అర్థం కాలేదు నువ్వు బంగాళాలు చాలా బాగా కట్టించినందుకు చాలా సంతోషిస్తున్నాం ..
        50,000 ఖర్చుపెట్టిన అలా కట్టించలేరు.
         చిత్తం చిత్తం అది ఏలిన వారి కటాక్షం నువ్వు చాదస్తపు బ్రాహ్మణుడైతే ఇలా పిచ్చిపిచ్చిగా లెక్కలు వేశావు. మరొకరు అయితే 50వేలకి కిట్టించి ఉందురు. సోమనాదం ఏమీ మాట్లాడలేదు. నువ్వు ఒక్క దమ్మిడి అయినా ముట్టుకోకుండా నానా కష్టాలు పడి కాలం గడిపావు. మేము జీతం ఏదైనా ఏర్పాటు చేసి ఉంటామని బ్రాంతిపడి ఉంటావు. ఇలాంటి వాటికి జీతం పద్ధతి ఏర్పాట్లు లేదు....
          సోమనాదం నిలువునా నీరసం ఐపోయాడు దివాన్ ఏమి అంటున్నది అతనికి అర్థం కాలేదు అయినా నువ్వు నిరుత్సాహ పడవద్దు ఇలా పని చేయించినందుకు నీకు తగిన ప్రతిఫలమే ముడ్తుంది.
           50వేల పనిని పాతిక వేళలో ముగించి సంస్థానం వారికి లాభం చూపించినందుకు నీకు 5000 కట్టడం గా ఇస్తున్నాము సోమనాదం ఆనందం పట్టలేకపోయాడు. నిజమే నిజమే అతని నోటి నుంచి అప్రయత్నంగా రెండుమూటలు వెలుపడ్డాయి ...
           నిజమే ఇందులో అబద్ధం ఏమీ లేదు నువ్వు కాంట్రాక్టర్ అనుకో నీకు ఈ బంగాళా కట్టించడానికి 30000 కి గుత్త కిచ్చినామనుకో నువ్వు ఎంత ఖర్చు పెట్టినది మాకు అనవసరం. మా కోరిక పని పసందుగా ఉండడమే మాకు కావాలి. నువ్వు పాతికవేలే ఖర్చు చేస్తే మిగిలినది 5000 నీకు లాభం అన్నమాట. సోమనాదం ఏదో చెప్పబోయాడు మరి నువ్వు మాటలాడకు. నీ వంటి చాదేస్తుంది నేనెక్కడ చూడలేదు రేప్పొద్దురా 30 వేలకి లెక్కలు కిట్టించి తీసుకురా 30000 కి నీకు కాంట్రాక్టుకు ఇచ్చినట్లు వ్రాసి ఉన్న ఈ అగ్రిమెంట్ మీద నువ్వు సంతకం చెయ్యి. నువ్వు పని ప్రారంభించిన తేదీ వెయ్యి. రేపు పొద్దున వచ్చి ఆ కాయితాలు ఇచ్చి ఐదు వేలు తీసుకువెళ్ళు. సోమనాదం కృతజ్ఞతతో చిత్తం చిత్తం ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదండి ప్రభువు అని మనవి చేశాడు.. ఇంతే కాదో నీకు రేపటి నుంచి ఇంజనీరు డిపార్ట్మెంట్లో నెలకొన్న 40 రూపాయల ఉద్యోగం ఏర్పాటు చేయబడింది.. సోమనాదం ఆనందంతో ఆకాశం అందుకున్నాడు....

1 comment:

  1. మంచి కథ. కథా రచయిత పేరు చెప్పగలరా?

    ReplyDelete

kakubhushunda

[04/01, 11:26 am] Siva Kumar: ఒకసారి వశిష్ట మహర్షి స్వర్గలోకంలో సభ లో ఉండగా అందులో ఒక ఋషి  కాకభూషుండ  కాకి అనే చిరంజీవి గురించి చెప్తాడు అది...