Tuesday, May 1, 2018

Health tips telugu

*నేటి తరుణంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి తొడ కండరాలు పట్టేయడం. లేదంటే కాలి పిక్కలు కూడా కొందరికి పట్టేస్తుంటాయి. సాధారణంగా చాలా మందికి నిద్రలో ఇలా జరుగుతుంది. ఇక కొందరికైతే రోజులో ఇతర సమయాల్లో కూడా ఈ సమస్య వస్తుంటుంది. దీనికి కారణాలు అనేకం ఉంటాయి. వయస్సు మీద పడడం, దీర్ఘ కాలిక అనారోగ్యాలు ఉండడం,*_                          _*వ్యాయామం చేస్తున్నప్పుడు, క్రీడలు ఆడుతున్నప్పుడు లేదా పోషకాహార లోపం వంటి సమస్యల వల్ల కూడా తొడ కండరాలు లేదా పిక్కలు పట్టేస్తుంటాయి. అలాంటి సమయాల్లో విపరీతమైన నొప్పి వస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. కానీ కింద తెలిపిన విధంగా కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
_*👉మరి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!*

1. *తొడ కండరాలు లేదా కాలి పిక్కలు పట్టేసినప్పుడు ఆ ప్రదేశంలో ఐస్ గడ్డలు కలిగిన ప్యాక్‌ను కొంత సేపు ఉంచాలి. నొప్పి తగ్గేంత వరకు ఇలా చేయాలి. దీంతో ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.*
2. *కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్‌, ఆవ నూనెలను సమభాగాల్లో తీసుకుని మిశ్రమంగా చేసి దాన్ని వేడి చేయాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని సమస్య ఉన్న ప్రదేశంలో రాస్తూ సున్నితంగా మర్దనా చేయాలి. దీంతో బిగుసుకుపోయిన కండరాలు సాగుతాయి. నొప్పి తగ్గుతుంది.*

3. *కొబ్బరినూనె కొంత తీసుకుని దాంట్లో కొన్ని లవంగాలు వేయాలి. అనంతం ఆ మిశ్రమాన్ని వేడి చేయాలి. దీన్ని గోరు వెచ్చగా ఉన్నప్పుడు సమస్య ఉన్న ప్రాంతంలో రాయాలి. ఇలా చేయడం వల్ల కూడా సమస్య నుంచి బయట పడవచ్చు.*

4. *సాధారణంగా చాలా మందికి డీహైడ్రేషన్ సమస్య వస్తుంటుంది. నీరు తగినంతగా తాగకపోతే ఇలా జరుగుతుంది. డీహైడ్రేషన్ వచ్చినప్పుడు తొడ కండరాలు లేదా పిక్కలు పట్టేస్తాయి. అలాంటప్పుడు తగినన్ని నీరు తాగితే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.*
5. *శరీరంలో తగినంతగా పొటాషియం లేకపోయినా ఇలా జరుగుతుంది. అలాంటి వారు పొటాషియం ఎక్కువగా ఉండే అరటిపండ్లు తదితర ఆహారాలను తీసుకుంటే సమస్య రాకుండా ఉంటుంది.* *మి నవీన్ నడిమింటి*
 
ఆరోగ్యాన్ని పెంపొందించే సబ్జా గింజ‌లు.... అవి ఏం చేస్తాయో తెలుసా...?

వీటి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే మనకు తెలిసిన విత్తనాలన్నింటిలోనూ భలే వింతగా ప్రవర్తించేవి ఇవే కాబట్టి..! చాలామందికి ఇవి బాగా గుర్తుండిపోయి ఉంటాయి. నీటిలో వేయగానే ఉబ్బి, జెల్‌లా తయారవుతాయి సబ్జ గింజలు. వీటిని ఒక గ్లాసు నీళ్లలో నానబెట్టుకొని ఆ నీటిని తాగితే జీవక్రియలు చురుగ్గా సాగుతాయట.. మహిళలకు తప్పకుండా కావాల్సిన ఫోలేట్‌తో పాటు అందాన్ని ఇనుమడింపచేసే విటమిన్ 'ఇ' కూడా ఇందులో లభిస్తుంది.. మరి ఇంకా ఎలాంటి ఖనిజాలు వీటిలో దాగున్నాయో ఒకసారి చూద్దాం..!

* ఈ విత్తనాలకు కాస్త తడి తగిలినా అవి ఉబ్బిపోతాయి. దీంతో వాటి బరువు పదింతలు పెరిగిపోతుంది.. అందుకే వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే త్వరగా కడుపునిండిన భావన కలిగి మాటిమాటికీ ఆకలేయదు.

* జిగురులా ఉండే ఈ సబ్జ గింజల్లో ఔషధగుణాలు బోలెడు ఉంటాయి, పైగా శరీర ఉష్ణోగ్రతను సైతం తగ్గించి మల, మూత్ర సమస్యల్ని నివారిస్తాయి.

* కేవలం శరీరం లోపలి భాగాన్నే కాక బయట భాగాన్ని కూడా కాపాడటంలో ఇవి బాగా పనిచేస్తాయి. ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు ఈ గింజల్ని బాగా నూరి నూనెతో కలిపి గాయాలు, పుండ్లపై రాసుకోవచ్చు, దీని వల్ల అవి త్వరగా తగ్గుతాయి.

* తలనొప్పి, మైగ్రేన్ లాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఈ గింజల్ని నీళ్లలో కలుపుకొని అవి ఉబ్బిన తర్వాత తాగి చూడండి, సమస్య తగ్గిపోవడమే కాదు.. మానసికంగా ప్రశాంతత కూడా మీ సొంతమవుతుంది.

* రక్తాన్ని శుద్ధి చేయడంలో, శరీరంలోని మలినాలను తొలగించడంలోనూ దీని తరువాతే ఏదైనా..!

* శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కొన్ని గోరువెచ్చని నీటిలో అల్లం రసం, తేనె, నానబెట్టిన సబ్జ గింజలు, ఈ మూడు వేసి కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడంతో పాటు శ్వాస కూడా బాగా ఆడుతుంది.

* క్రీడాకారులకు ఈ గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఆటలు ఎక్కువగా ఆడటం వల్ల శరీరంలో తేమ తగ్గి నీరసించిపోతారు. అందుకే ఈ విత్తనాలను రోజూ తీసుకుంటే శరీరంలో తేమను పోనీకుండా నిలిపి ఉంచుతాయి..

* గొంతులో మంట, ఆస్తమా, తీవ్రమైన జ్వరం, తలనొప్పి.. లాంటి సమస్యలు పీడిస్తున్నాయా..? ఇలాంటప్పుడు ఈ గింజల్ని నీళ్లలో నానబెట్టి నేరుగా తినేయండి. ఎలాంటి చిరాకునైనా ఇట్టే తగ్గిస్తాయి.

* బీపీ మాటిమాటికీ పెరుగుతోందా..? అయితే వీటిని కచ్చితంగా తీసుకోవాల్సిందే.. వీటిని రోజూ తీసుకోవడం వల్ల బీపీ నెమ్మదిగా అదుపులోకి వస్తుంది..

* వీటిలో ఒమెగా - 3 ఫ్యాటీ యాసిడ్లు సాల్మన్ చేపల్లో కంటే ఎక్కువగా లభిస్తాయి. ఈ ఒమెగా-3 ఆమ్లాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్, హృదయ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.

* బ్యాక్టీరియా సంబంధిత సమస్యలని నివారించే మంచి యాంటీబయోటిక్‌లా కూడా పనిచ

No comments:

Post a Comment

kakubhushunda

[04/01, 11:26 am] Siva Kumar: ఒకసారి వశిష్ట మహర్షి స్వర్గలోకంలో సభ లో ఉండగా అందులో ఒక ఋషి  కాకభూషుండ  కాకి అనే చిరంజీవి గురించి చెప్తాడు అది...